హైదరాబాద్, జూలై 12: ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం)గా అమిత్ జిన్గ్రాన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బ్యాంకు డిప్యూటీ ఎండీగా ప్రమోటైన ఓపీ మిశ్రా స్థానంలోకి అమిత్ వచ్చారు. హైదరాబాద్ సీజీఎంగా నియమితులు కావడానికి ముందు అమిత్ జిన్గ్రాన్ ఎస్బీఐ చికాగో, యూఎస్ఏ శాఖకు సీఈవోగా వ్యవహరించారు.