ఢిల్లీ ,మే 12: కరోనాకష్టకాలంలో అగరుబత్తి రంగం స్థానికులకు జీవనోపాధి కల్పించనున్నది. కర్ర ఉత్పత్తి కోసం స్టిక్ తయారీ యూనిట్లను సమన్వయం చేయడానికి, ముడి పదార్థాల లభ్యత, యూనిట్ల పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, మార్కెటింగ్ మొదలైనవాటిని సమన్వయం చేయడానికి జాతీయ వెదురు మిషన్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (ఎంఐఎస్) ఆధారిత రిపోర్టింగ్ వేదికను ప్రారంభించింది. దీనిద్వారా ఉత్పత్తి యూనిట్లను ప్రారంభించడానికి పరిశ్రమతో ఉన్న అనుసంధానాలను మెరుగ్గా సమన్వయం చేస్తారు. గ్లోబల్ మార్కెట్లలో భారతీయ అగరుబత్తిని ఎక్కువగా కోరుకుంటున్నందున, ‘వోకల్ ఫర్ లోకల్’ , ‘మేక్ ఫర్ ది వరల్డ్’ లకు మరింత మద్దతు ఎలా ఇవ్వవచ్చో అంచనా వేయడానికి అన్నిరాష్ట్రాల జాతీయ వెదురు మిషన్ యూనిట్ల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు.
జాతీయ వెదురు మిషన్ (ఎన్బిఎం)చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఇ), ఖాదీ , గ్రామ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) పథకాలతో పాటు రాష్ట్రాలు, పరిశ్రమ భాగస్వాములతో కలిసి భారతదేశం ఆత్మ నిర్భర్గా మారడానికి కేంద్రీకృత మద్దతును పెంచింది. దీనివల్ల అగరుబత్తి రంగం, స్థానిక సమాజాలకు జీవనోపాధిని తిరిగి కల్పించడమేకాదు.. ఈ రంగాన్ని కూడా ఆధునీకరించగలుగుతారు.
అగరుబత్తి రంగం సాంప్రదాయకంగా స్థానిక శ్రామికశక్తికి పెద్ద ఎత్తున ఉపాధి కల్పించింది. 2019 లో ఎన్బిఎం ఒక సమగ్ర అధ్యయనం నిర్వహించింది. దీని తరువాత ముడి బత్తుల దిగుమతులపై పరిమితులు విధించారు. రిస్ట్రిక్టెట్ కేటగిరీలోకి మార్చారు. పుల్లలపై దిగుమతి సుంకాన్ని జూన్ 2020 లో 25శాతంపెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు స్థానిక అగరబత్తుల తయారీ రంగానికి ఊపునిచ్చాయి.
దేశీయ పారిశ్రామిక కార్యకలాపాలను మెరుగుపర్చడానికి జాతీయ వెదురు మిషన్ తగిన నిర్ణయాలు తీసుకుంటున్నది. అలాగే సాంకేతిక సంస్థల మద్దతుతో , పథకాలతో రైతు ఆదాయాన్ని పెంచుతున్నది. ప్రత్యక్ష రాయితీ కింద రైతులకు హెక్టారుకు రూ .1.00 లక్షల చొప్పున సబ్సిడీ ఇస్తున్నారు. ప్రభుత్వ సంస్థలకు 100 శాతం ఇస్తుండగా వివిధ ఉత్పత్తి అభివృద్ధి విభాగాలను ఏర్పాటు చేయడానికి వ్యవస్థాపకులకు కూడా రాయితీలు ఇస్తున్నారు. మిషన్ ప్రస్తుతం మొత్తం తొమ్మిది ఈశాన్య రాష్ట్రాలతో సహా 21 రాష్ట్రాల్లో అమలవుతున్నది.
సంబంధిత రాష్ట్ర వెదురు మిషన్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. వాణిజ్యపరంగా అవసరమైన జాతుల తోటలను చేపట్టడానికి, సాధారణ సదుపాయాల కేంద్రాల నిర్మాణాలకు , ఇతర పంటకోత యూనిట్ల ఏర్పాటుకు, రైతులకు నాణ్యమైన సామగ్రిని అందుబాటులో ఉంచడం వంటి చర్యలు తీసుకోవాలని ఎన్బిఎం రాష్ట్రాలకు సూచించింది. దీనివల్ల కొత్త పరిశ్రమలతోపాటు పాత వాటికి, రైతులకు, భారతీయ వెదురు పరిశ్రమకూ మేలు జరుగుతుంది.