కరోనా నిబంధనలు పాటిస్తూ ధాన్యం విక్రయించాలి
అన్నదాతల అభివృద్ధే తెలంగాణ సర్కారు ధ్యేయం
పెంచికలపేట పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి
ఆత్మకూరు, మే 9: రైతులకు ఇబ్బందులు లేకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని పెంచికలపేట పీఏసీఎస్ చైర్మన్ కంది శ్రీనివాస్రెడ్డి అన్నారు. అన్నదాతలు కరోనా నిబంధనలు పాటిస్తూ ధాన్యం విక్రయించాలని కోరారు. పెంచికలపేట పీఏసీఎస్ ఆధ్వర్యంలో కామారం, బ్రా హ్మణపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్నదాతల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఆత్మకూరు పీఏసీఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్గౌడ్, సర్పంచ్ పర్వతగిరి రాజు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పోతురాజు రాజు, డైరెక్టర్లు కోడూరి రమేశ్, వీర్ల వెంకటరమణ, తోట కుమార్, తోట చంద్రశేఖర్, రేవూరి జయపాల్రెడ్డి, మత్స్యశాఖ అధ్యక్షుడు బయ్య తిరుపతి, ప్రధాన కార్యదర్శి కుక్కల రఘుపతి, డైరెక్టర్లు గుండెబోయిన భిక్షపతి, శ్యామ్, బయ్య నరేశ్, మాజీ ఎంపీటీసీ పరికిరాల రజిత-వాసు, వార్డు సభ్యులు, రైతులు వంగాల బుచ్చిరెడ్డి, కోడూరి భిక్షపతి, సీఈవో ఓదెల లక్ష్మయ్య పాల్గొన్నారు.
పల్లార్గూడలో..
సంగెం: పల్లార్గూడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు నరహరి, సర్పంచ్లు కే కుమారస్వామి, బిచ్చానాయక్, పీ స్రవంతి, జీ రమ, జలేంధర్, జీ వీరన్న, నాయకులు అనిల్, రవీందర్, చిన్న స్వామి, రమేశ్, కోటేశం, మొయినొద్దీన్ పాల్గొన్నారు.