ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్స్ రిటైల్ గ్రూప్ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు కిశోర్ బియానీకి ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కినుక వహించింది. ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ బుధవారం సుప్రీంకోర్టును అమెజాన్ ఆశ్రయించింది.
రూ.24,713 కోట్లకు రిలయన్స్ రిటైల్లో ఫ్యూచర్ గ్రూప్ విలీనానికి రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఫ్యూచర్ రిటైల్ గ్రూప్లో పట్టుబడులు పెట్టింది అమెజాన్.
ఈ క్రమంలో భవిష్యత్లో ఫ్యూచర్ రిటైల్ను తమకే విక్రయించాలన్న నిబంధనను నాటి ఒప్పందం చేర్చింది. కానీ ఫ్యూచర్ రిటైల్ ఆ నిబంధనలను ఉల్లంఘించి మరీ రిలయన్స్లో విలీనానికి ముందుకెళడాన్నిసవాల్ చేస్తూ అమెజాన్ న్యాయ పోరాటానికి దిగింది.
స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్గులు