న్యూఢిల్లీ: ఇప్పుడంతా కరోనా మహమ్మారి వెంటాడుతున్న కాలం.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా ( Health Insurance ) పాలసీ తీసుకోవడం తప్పనిసరి. అయితే నూతన బీమా పాలసీదారులు సరైన ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం కూడా. మీ కుటుంబ అవసరాలు, బీమా రంగ మార్కెట్ను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని ఎంచుకునే ముందు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలేమిటో చూద్దామా..!
మీరు ఏదైనా ఆరోగ్య సమస్య, వ్యాధితో బాధపడుతుంటే.. ఆయా బీమా కంపెనీలు దానికి కవరేజీ ఇస్తున్నాయా.. లేదా.. అన్న సంగతి ముందుగా తెలుసుకోవాలి. కొన్ని సంస్థలు మీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు కవరేజీని ఇస్తాయి. మరికొన్ని ఇవ్వవు. ఇటువంటి తరుణంలో మీ అనారోగ్య సమస్యకు అందునా తక్కువ వెయిటింగ్ పీరియడ్లో కవరేజీ ఇచ్చే బీమా పాలసీని ఎంచుకోవాలి.
ఇన్సూరెన్స్ పాలసీలో క్రిటికల్ అనారోగ్య సమస్యకు క్లెయిమ్ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కొన్ని కీలక అనారోగ్య సమస్యలకు తక్కువ క్లెయిమ్ మొత్తాలు మాత్రమే ఆఫర్ చేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఆయా ఆరోగ్య బీమా పాలసీల గురించి జాగ్రత్తగా తెలుసుకోవాలి. బీమా కవరేజీ లభించే క్రిటికల్ ఇల్నెస్ జాబితానూ జాగ్రత్తగా చదివాకే నిర్ణయం తీసుకోవాలి.
ఎల్లవేళలా కస్టమర్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చుల కవరేజీ కల్పించే బీమా పాలసీలను ఎంచుకోవడం బెటర్గా ఉంటుంది. పలు బీమా సంస్థలు ఆఫర్ చేస్తున్న కొన్ని పాలసీల ప్రకారం పరిమితి దాటిన తర్వాత రూమ్, ఐసీయూ బిల్లు పాలసీ తీసుకున్న వారే చెల్లించాల్సి ఉంటుంది. ఈ అంశాలన్నీ బీమా పాలసీపై సంతకం చేసే ముందు తెలుసుకోవాలి.
గరిష్ట టర్మ్ బీమా పాలసీ తీసుకుంటే భారీ మొత్తంలో ప్రీమియం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అటువంటి పాలసీలపై డిస్కౌంట్ అందిస్తున్న బీమా సంస్థలు అనేకం ఉన్నాయి. ఈ పాలసీ టర్మ్ గరిష్ఠంగా మూడేండ్లు ఉంటుంది. కనుక కస్టమర్లు ఈ ప్రీమియంపై వచ్చే డిస్కౌంట్ను తమకు అనుకూలంగా మార్చుకోవాలి.
బీమా పాలసీ తీసుకున్న కస్టమర్ తాను పొందే బీమా సేవలకు తాను కొంత కో-పేమెంట్ రూపంలో చెల్లించాలి. అది అడ్వాన్స్గానే చెల్లించాలి. సీనియర్ సిటిజన్లకు పలు బీమా పాలసీలు తమ పాలసీల్లో ఈ కో-పేమెంట్ స్కీమ్ ఆఫర్ చేస్తున్నాయి. కో-పేమెంట్ ఆప్షన్ తొలగించొచ్చు. అలా చేయాల్సి వస్తే అదనపు ప్రీమియం మరికొంత చెల్లించాలి.
ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త చార్జీలు
గుడ్ న్యూస్.. ప్రత్యక్ష పన్ను వసూళ్లు రెట్టింపు.. ఎంతంటే..!:
కార్లపై ఇన్ఫుట్ కాస్ట్ దెబ్బ.. మహీంద్రా థార్ ధరెంతంటే?!
ఇంధన డిమాండ్.. జూన్లో రికవరీ.. ఎలాగంటే..!!
చౌకగా లాప్టాప్లు.. రూ.24 వేల లోపు రెడీ.. ఇవీ డిటైల్స్..
బ్యాంకింగ్ అవకతవకలకు చెల్లు.. అందుకు ఆర్బీఐ కంపల్సరీ లీవ్
జనాభా నియంత్రణ తప్పనిసరి: శరద్ పవార్
కరోనా నుంచి కోలుకున్నాడు.. ఎవరెస్ట్ను అధిరోహించాడు
మోదీ కేబినెట్లో 90 శాతం మంది కోటీశ్వరులే..
పద్మ అవార్డులకు మీరే నామినేట్ చేయండి.. ప్రజలను కోరిన ప్రధాని మోదీ
దిగివచ్చిన ట్విటర్.. ఫిర్యాదు అధికారిగా వినయ్ ప్రకాశ్ నియామకం