న్యూఢిల్లీ: ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మరో రికార్డు నెలకొల్పింది. తాజాగా ఆర్బీఐ జారీ చేసిన గైడ్లైన్స్ ప్రకారం ఈ బ్యాంక్లో ఒక రోజు రూ.2 లక్షల మేరకు బ్యాలెన్స్ ఉంచుకోవచ్చు.
దీని ప్రకారం ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఖాతాదారులు తాజా ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా తమ ఖాతాలో బ్యాలెన్స్ నిలువలు పెంచుకోవచ్చు. పేమెంట్స్ బ్యాంకుల్లో రూ.2 లక్షల వరకు బ్యాలెన్స్ గల వాటిలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మొదటిది కానున్నది.
ఇంతకుముందు పేమెంట్స్ బ్యాంకుల్లో ఖాతాదారులు రూ. లక్ష వరకు మాత్రమే బ్యాలెన్స్ ఉంచుకోవడానికి ఆర్బీఐ అనుమతించింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ), ఇతర బిజినెస్లు చేసేవారి అవసరాలకు అనుగుణంగా పేమెంట్స్ బ్యాంకుల్లో వారి నిల్వలు పెంచుకోవడానికి సుముఖత వ్యక్తం చేసింది.
దేశంలో పేమెంట్స్ బ్యాంక్స్గా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఫినో పేమెంట్స్ బ్యాంక్, జియో పేమెంట్స్ బ్యాంక్, ఎన్ఎస్డీఎల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలందిస్తున్నాయి.
ఆర్బీఐ నిర్ణయం భారతదేశంలో పేమెంట్స్ బ్యాంక్ పాత్రను మరింత పెంచేందుకు దోహద పడుతుందని ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఎండీ కం సీఈవో అనుబ్రత బిశ్వాస్ చెప్పారు. 2017 జనవరిలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు ప్రారంభించింది.
పెండ్లి గౌనులో వచ్చి కరోనా టీకా తీసుకున్న యువతి.. అసలు కారణం తెలిసి షాకైన వైద్య సిబ్బంది
57 దేశాల్లోని మహిళలకు వారి శరీరాలపై హక్కులు లేవు..!
త్వరలో కరోనా మూడో వేవ్ వచ్చే అవకాశం : ఆదిత్యా ఠాక్రే
ప్రిన్సిపాల్ చెంపదెబ్బ.. బాలిక ఆత్మహత్య
నిత్యం 3 లక్షల రెమ్డెసివిర్ డోసుల ఉత్పత్తి : మన్సుఖ్ మాండవీయ
రేపు అంగారకుడిపై ఎగరనున్న నాసా హెలికాప్టర్
పేదల బాగు కోసం భూదానం.. చరిత్రలో ఈరోజు
ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు మంత్రిని మార్చిన ఇమ్రాన్ఖాన్
రాత్రి విధుల పేరిట మహిళలకు ఉద్యోగాలివ్వరా?: కేరళ హైకోర్టు
బతుకుదెరువు కోసం ఆటో నడుపుతున్న జాతీయ బాక్సర్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..