న్యూఢిల్లీ, జూలై 2: భారతీ ఎయిర్టెల్ శుక్రవారం గృహస్తుల కోసం ఓ సరికొత్త బండిల్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఆల్-ఇన్-వన్ ప్యాక్తో కస్టమర్లు మొబైల్, ఫైబర్, డీటీహెచ్ సర్వీసులను అందుకోవచ్చని సంస్థ తెలిపింది. ‘ఎయిర్టెల్ బ్లాక్’ పేరుతో పరిచయమైన ఈ ఆఫర్లో నెలకు రూ.998 ధర కలిగిన ప్యాక్లో 2 మొబైల్ కనెక్షన్లు, ఒక డీటీహెచ్ కనెక్షన్ పొందవచ్చు. అలాగే రూ.2,099 ప్యాక్లో 3 మొబైల్ కనెక్షన్లు, ఒక ఫైబర్ కనెక్షన్, ఓ డీటీహెచ్ కనెక్షన్ ఉంటుంది. కాగా, ఒక్కో వినియోగదారుడి నుంచి పొందే సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) మరింత పెంచుకోవాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ ప్యాకేజీని సంస్థ ప్రవేశపెట్టింది. అలాగే సింగిల్ రీచార్జ్తో మొత్తం ఇంటి అవసరాలను తీర్చుకోవచ్చన్న ఆలోచన కూడా ప్యాకేజీకి కారణమైంది. అయితే రిలయన్స్ జియో ఫైబర్కు పోటీగానే ఎయిర్టెల్ ప్రధానంగా ఈ ప్యాక్ను రూపొందించిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.