న్యూఢిల్లీ, జూలై 28: భారతీ ఎయిర్టెల్ తమ ప్రారంభ స్థాయి ప్రీ-పెయిడ్ రిచార్జ్ ప్లాన్ రూ.49కి స్వస్తి పలికింది. ఇకపై రూ.79తోనే ప్రీ-పెయిడ్ ప్యాక్లు మొదలవుతాయని బుధవారం ప్రకటించింది. ఇటీవలే పలు పోస్ట్-పెయిడ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచిన ఎయిర్టెల్.. ఇప్పుడు ఎంట్రీ లెవల్ ప్రీ-పెయిడ్ ప్లాన్ ధరనూ దాదాపు 60 శాతం పెంచేసింది. కాగా, పాత ప్లాన్తో పోల్చితే కొత్త ప్లాన్లో నాలుగు రెట్లు అధికంగా టాక్ టైం, రెట్టింపు డాటా వినియోగదారులకు లభిస్తుందని ఈ సందర్భంగా ఎయిర్టెల్ తెలియజేసింది. గురువారం నుంచి అందుబాటులో ఉండే ఈ కొత్త ప్లాన్.. రూ.64 విలువైన టాక్ టైం, 200 ఎంబీ డాటాతో 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.