న్యూఢిల్లీ: న్యూఢిల్లీ, జూన్ 21: ‘మేడ్ ఇన్ ఇండియా’ 5జీ నెట్వర్క్ సొల్యూషన్స్ అమలుకు భారతి ఎయిర్టెల్, టీసీఎస్లు ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సోమవారం ప్రకటించాయి. ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం టీసీఎస్ అభివృద్ధిపర్చిన ఓ-రాన్ (ఓపెన్ రెడియో యాక్సెస్ నెట్వర్క్) ఆధారిత, ఎన్ఎస్ఏ/ఎస్ఏ కోర్ సొల్యూషన్లను ఎయిర్టెల్ ఉపయోగించి, 5జీ టెలిసర్వీసుల్ని ఆవిష్కరిస్తుంది.
2022 జనవరిలో ఇందుకు సంబంధించిన పైలెట్ ప్రాజెక్టును ఎయిర్టెల్ ప్రారంభిస్తుంది. పూర్తిగా దేశీయ టెక్నాలజీతో టెలికం రంగ అవసరాల కోసం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్.. ఓ-రాన్ (ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్వర్క్)ను టీసీఎస్ అభివ్రుద్ధి చేసింది. తన భాగస్వాములకు మాత్రమే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది.