న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ సంస్థ పేటీఎం మరో అడుగు ముందుకేసింది. నిధులను సేకరించడానికి ఐపీవోకు వెళ్లాలన్న పేటీఎం తీసుకున్న నిర్ణయానికి వాటాదారుల అనుమతి లభించింది. దీంతో పేటీఎం పేరెంట్ సంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ రూ.12 వేల కోట్ల నిధులు సేకరించేందుకు మార్గం సుగమం అయ్యింది.
దీంతోపాటు కంపెనీలోని ఇతర వాటాదారుల వద్ద గల కొన్ని షేర్లు కూడా విక్రయించనున్నది. తద్వారా రూ.16, 600 కోట్ల నిధులు సేకరించనున్నది. వాటాదారుల సమావేశంలో 97 కమ్యూనికేషన్స్ కంపెనీ ప్రమోటర్గా విజయ్ శేఖర్ శర్మ అని చెప్పారు.
సెబీ నిబంధనలకు అనుగుణంగా కంపెనీ చైర్మన్, సీఈవో కం ఎండీగా విజయ్ శేఖర్ శర్మ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. సెబీ నిబంధనల ప్రకారం ప్రమోటర్కు కంపెనీలో కనీసం 20శాతం వాటాలు ఉండాలి. కానీ, విజయ్ శేఖర్ శర్మ వద్ద ప్రస్తుతం 14.61% వాటాలు మాత్రమే ఉన్నాయి.
కరోనా థర్డ్ వేవ్ తప్పదు.. అదీ త్వరలోనే: ఇండియన్ మెడికల్ అసోసియేషన్
నార్కో టెర్రర్ను ఆపాలి: అమిత్ షా
కశ్మీర్ను లూటీ చేసేందుకే ఆర్టికల్ 370 రద్దు
నిబంధనలు పాటించని ఫలితం.. జన్పథ్ మార్కెట్ మూసివేత
లఢాక్లో చొరబడిన చైనా సైనికులు.. దలైలామా బర్త్డే వేడుకలపై నిరసన
అంతరిక్షం నుంచి భూమిని చూడడం అద్భుతం: శిరీష బండ్ల
భార్య గొంతెమ్మ కోరికలు తీర్చడం కోసం చైన్ స్నాచర్గా మారిన భర్త..!
గిన్నిస్’ రికార్డు గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు అంకితం
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించిన పాలమూరు మహిళలు
వీడియో: స్కూల్ క్యాంటీన్లోకి ప్రవేశించిన చిరుత
వరిగడ్డితో చెప్పుల తయారీ.. ఎక్కడో తెలుసా?
తమిళనాడును విభజించే యోచనలేదు: బీజేపీ
సెప్టెంబర్ 12న నీట్ (యూజీ) పరీక్ష.. రేపటి నుంచి దరఖాస్తు ప్రక్రియ