హైదరాబాద్, డిసెంబర్ 3: ఏరోస్పేస్, రక్షణ రంగానికి సంబంధించిన విడిభాగాల తయారీ సంస్థ ఎస్కేఎం టెక్నాలజీ.. హైదరాబాద్లో తన తొలి యూనిట్ను ప్రారంభించింది. మహిళా పారిశ్రామికవేత్తలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. ఆదిభట్లలోని ఏరోస్పేస్ పార్క్లో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్ను నెలకొల్పింది. ప్రస్తుతం రాఫెల్, పీఅండ్డబ్ల్యూ, హెచ్ఏఎల్, డీఆర్డీవో, బీడీఎల్తోపాటు ఇతర సంస్థలకు విడిభాగాలను సరఫరా చేస్తున్నది. మరోవైపు హెచ్ఏఎల్ నుంచి ‘బెస్ట్ సప్లయిర్’ అవార్డును కంపెనీ ఎండీ సరిత రాతిబండ్ల బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అందుకున్నారు.