పుణే: భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యఛేదనను ఇంగ్లండ్ ఘనంగా ప్రారంభించింది. ఓపెనర్ జేసన్ రాయ్ సిక్సర్తో 48 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ఇందులో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. మరో ఓపెనర్ బెయిర్ స్టో కూడా రాణించడంతో 15 ఓవర్లకు ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 87 పరుగులు చేసింది.