న్యూఢిల్లీ: గౌతం ఆదానీ సారధ్యంలోని ఆదానీ పోర్ట్స్కు ఎస్&పీ డోజోన్స్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మయన్మార్లో కుట్రతో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేసిన సైన్యానికి ఆదానీ గ్రూప్ సంస్థకు వ్యాపార లావాదేవీలు ఉండటమే దీనికి కారణం అని ఎస్ అండ్ పీ డోజోన్స్ ఇండెక్స్ ప్రకటించింది. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చేసిన మయన్మార్ సైన్యం దేశంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నది.
ఆదానీ పోర్ట్స్ను తమ ఎక్స్చేంజీలోని సంస్థల జాబితా నుంచి గురువారం తొలిగిస్తున్నట్లు ఎస్ అండ్ పీ డోజోన్స్ ఇండెక్స్ ఓ ప్రకటనలో తెలిపింది. డోజోన్స్ నిర్ణయాన్ని మయన్మార్ మానవ హక్కుల, ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలు స్వాగతించారు.
మిలిటరీ మద్దతుతో ఏర్పాటైన మయన్మార్ ఎకనమిక్ కార్పొరేషన్ (ఎంఈసీ) నుంచి యాంగాన్లో భూమిని లీజుకు తీసుకున్న ఆదానీ పోర్ట్స్ 290 మిలియన్ల డాలర్లతో పోర్ట్ నిర్మిస్తున్నది. ఎస్ అండ్ పీ డోజోన్స్ ప్రకటనపై స్పందించడానికి ఆదానీ పోర్ట్స్ అందుబాటులోకి రాలేదు.
మయన్మార్లో మానవ హక్కుల ఉల్లంఘన మొదలైన తర్వాత పోర్టు నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని వాటాదారులు, ప్రభుత్వ అధికారులతో గత నెలలోనే చర్చించామని ఆదానీ గ్రూప్ వెల్లడించింది. ఎంఈసీ నుంచి లీజుకు తీసుకున్న స్థలానికి ఆ సంస్థకు మిలియన్ల డాలర్ల అద్దె చెల్లిస్తున్నామని పేర్కొంది.
గత ఫిబ్రవరి ఒకటో తేదీన మిలిటరీ కుట్రకు పాల్పడడంతోపాటు ప్రజాస్వామ్య, మానవ హక్కుల కార్యకర్తలపై హింసకు పాల్పడింది. దీనివల్ల 700 మంది ప్రజలు మరణించారు. ఈ ఘటనను అంతర్జాతీయ సమాజం ఖండించింది. అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు మయన్మార్పై ఆంక్షలు విధించాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
బిట్ కాయిన్ ఆల్టైం రికార్డు@62,377 డాలర్లు!
తెలుగు ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని ఉగాది శుభాకాంక్షలు
ఇదెక్కడి పోయేకాలం.. యువకుడి జననాంగం కోసేసిన నపుంసకులు..!
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.61లక్షల కేసులు
రెండు కాళ్లు, మూడు చేతులతో.. ఒడిశాలో జన్మించిన అవిభక్త కవలలు
రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
IPL 2021:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా
IPL 2021:టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్కతా
బాయ్ఫ్రెండ్తో ఐరాఖాన్ బాక్సింగ్..వీడియో వైరల్
కొవిడ్ అంతానికి చాలా సమయం పడుతుంది: డబ్ల్యూహెచ్ఓ
అంత తక్కువ ధరకు మా వ్యాక్సిన్ అమ్మలేం: ఆర్డీఐఎఫ్