న్యూఢిల్లీ: టాటా సన్స్, రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్థలతోపాటు ఫోన్ పె, పేటీఎం, గూగుల్ పే వంటి న్యూ ఏజ్ కంపెనీలతో పోటీ పడేందుకు గౌతం ఆదానీ సారధ్యంలోని ఆదానీ గ్రూప్ సిద్ధమైంది. ఈ-కామర్స్ బిజినెస్లోకి ఎంటరయ్యేందుకు సూపర్ యాప్ ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఆదానీ డిజిటల్ ల్యాబ్స్ ఉద్యోగులతో జరిగిన సమావేశంలో గౌతం ఆదానీ ఈ సంగతి చెప్పారు.
ఈ-కామర్స్, ఆన్ లైన్ టికెట్ బుకింగ్, రీ చార్జింగ్ సర్వీస్ తదితర సేవలను తన ఖాతాదారులకు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గౌతం ఆదానీ తెలిపారు. ఆదానీ గ్రూప్కు 400 మిలియన్ల కన్జూమర్లు ఉన్నారు. వంట నూనెలు, గ్యాస్, విమానాశ్రయాలు, రియాల్టీ, ఫైనాన్సియల్ సర్వీసెస్, విద్యుత్ తదితర రంగాల్లో ఆదానీ గ్రూప్ వ్యాపార లావాదేవీలు జరుపుతోంది.