హైదరాబాద్/ ఖైరతాబాద్/ కవాడిగూడ, జూన్ 29 (నమస్తే తెలంగాణ): దళితుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆలయాలు కడతామని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి వెల్లడించారు. దళిత సాధికార పథకాన్ని ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ దళితజాతికి దేవుడయ్యారన్నారు. పథకం ప్రారంభమైన రోజే అన్ని కేసీఆర్ గుడికి భూమి పూజ చేస్తామని సోమా జీగూడ ప్రెస్క్లబ్లో మీడియాకు తెలిపారు. మంగళవారం ఆయన హైదరాబాద్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అక్కడే సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. మరోవైపు, దళితుల అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం కేసీఆర్కు దళితజాతి రుణపడి ఉంటుందని నాగర్కర్నూల్ ఎంపీ పీ రాములు అన్నారు. లోయర్ ట్యాంక్బండ్లో అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేశారు.