న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ఆర్థిక సుస్థిరత, వృద్ధికి ఖచ్చితమైన, విశ్లేషణాత్మకమైన ఆడిటింగ్ నివేదికలే ప్రధానమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. సోమవారం ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడిట్ అండ్ అకౌంట్స్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ రంగాల విషయానికొస్తే.. ఆడిటింగ్ అనేది సుపరిపాలనకు మూలస్తంభంగా పేర్కొన్నారు. పారదర్శక, నిష్పక్షపాత ఆడిటింగ్తో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. ఉద్దేశించిన ఫలితాల సాధనకు బాధ్యతాయుతమైన, ప్రభావవంతమైన ఆడిటింగ్ అవసరమని చెప్పారు.