ముంబై, ఏప్రిల్ 22: కరోనా మహమ్మారితో చిన్న వ్యాపారాలు చితికిపోయాయి. దేశంలో 82 శాతం చిరు వ్యాపారులు కొవిడ్-19తో తీవ్రంగా ప్రభావితులయ్యారని డాటా సంస్థ డన్ అండ్ బ్రాడ్స్ట్రీట్ సర్వే తెలిపింది. ముఖ్యంగా తయారీ రంగంలో అనేక ఇబ్బందులు వచ్చిపడ్డాయన్నది. రూ.100-250 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన 250కిపైగా సంస్థల అభిప్రాయాలు, వాటి తీరుతెన్నుల ఆధారంగా ఈ సర్వే జరిగింది. ఇదిలావుంటే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల రిటైల్ రుణాలకూ కరోనా సెగ తగులుతున్నది. ఆయా రాష్ర్టాల్లో లాక్డౌన్ కారణంగా వసూళ్లకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం భారత వృద్ధిరేటు 11 శాతంగా నమోదు కావచ్చని ఎస్అండ్పీ అంచనా వేసింది. అయితే ప్రస్తుత లాక్డౌన్లు పెరిగితే ఆ ప్రభావం తప్పక ఉంటుందని హెచ్చరించింది.
భారత్కు ఫిచ్ ప్రతికూల రేటింగ్
కరోనా కేసుల పెరుగుదలతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) రికవరీలో జాప్యం జరగవచ్చని, దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత్కు ప్రతికూల సార్వభౌమ రేటింగ్ (బీబీబీ-) ఇస్తున్నామని ఫిచ్ రేటింగ్స్ స్పష్టం చేసింది. అయితే ఈ రేటింగ్తో దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పదని పేర్కొన్నది.
ఇవీ కూడా చదవండి…
ఈ యాప్లు మీ మొబైల్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేయండి
కైలాస దేశంలోకి భారతీయుల రాకపై నిత్యానంద నిషేధం
మోదీకి చిరంజీవి చురకలు.. నిర్ణయాన్ని మార్చుకోమని సలహా