న్యూఢిల్లీ: సోషల్ మీడియా వేదికల్లో యూజర్ల డేటా లీక్ ఇటీవలి కాలంలో సర్వ సాధారణంగా మారింది. ఇటీవల 53.3 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా లీక్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నెటిజన్లు మరువక ముందే లింక్డ్ఇన్ యూజర్ల డేటా లీకైంది.
50 కోట్లకు పైగా లింక్డ్ఇన్ వినియోగదారుల డేటా డార్క్ వెబ్లో అమ్మకానికి ఉన్నట్లు సైబర్ న్యూస్ అనే సంస్థ పేర్కొంది. లీకైన సమాచారంలో లింక్డ్ఇన్ ఐడీ, పూర్తి పేర్లు, ఈ-మెయిల్ అడ్రస్లు, ఫోన్ నంబర్లు, ప్రొఫైల్స్, ఇతర కీలక వివరాలు ఉన్నాయి.
లింక్డ్ ఇన్ యూజర్లు 50 కోట్ల మంది వివరాల్ని హ్యాక్ చేసిన ఓసైబర్ నేరస్తుడు దాన్ని ఓ వెబ్సైట్లో అమ్మకానికి పెట్టాడని సైబర్న్యూస్ అనే వార్తా సంస్థ పేర్కొంది. ఈ డేటాను సదరు హ్యాకర్ కొన్ని వేల డాలర్లు విలువ గల బిట్కాయిన్లకు విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
దీనిపై లింక్డ్ ఇన్ యాజమాన్యం స్పందించింది. లీకైన డేటా తమ యూజర్ల ఫొఫైళ్ల నుంచి హ్యాక్ చేసినవి కాదని తెలిపింది. కొన్ని ఇతర వెబ్సైట్లు, కంపెనీల నుంచి ఈ డేటాను సేకరించారని పేర్కొంది.
ఇటీవల దాదాపు 50 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారుల సమాచారం ఆన్లైన్లో కనిపించడం ఇటీవల కలకలంరేపింది. 106 దేశాల వినియోగదారుల ఫేస్బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, ప్రాంతాలు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్ ఐడీలు, చిరునామాలు అమ్మకానికి ఉంచారు
ఈ డేటా ద్వారా స్పామ్ కాల్స్, స్పామ్ మెయిల్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సైబర్ నిపుణులు పేర్కొన్నారు. అలాగే యూజర్లు మీరు రక్షించుకోవడానికి టూ-స్టెప్-వెరిఫికేషన్ ఆక్టివేట్ చేసుకోవాలని, అలాగే మీ లింక్డ్ఇన్ ఖాతా పాస్వర్డ్, లింక్డ్ఇన్ ఖాతాతో అనుసంధానించిన ఈమెయిల్ చిరునామా మార్చుకోవాలని సూచిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కొవిడ్ రికవరీ రేటు మళ్లీ తగ్గిపోతోంది: కేంద్రం
మనిషిని పోలిన జీవికి మేక జన్మ.. దేవుడంటూ పూజలు
నిబంధనలు ఉల్లంఘిస్తే యమలోకానికే.. యముని వేషంలో కొవిడ్పై అవగాన..!
తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
‘పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
పుష్ప’ షేర్స్ పై కన్నేసిన అల్లు అర్జున్..?
తక్కువ సిబిల్ స్కోర్తోనూ పర్సనల్ లోన్.. అయితే!