రూ.1,873 కోట్లతో నిధి ఏర్పాటు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలోని చిరు వ్యాపారులకు చేయూతనిచ్చేందుకు 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.1,873 కోట్ల)తో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రకటించింది. చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థ (ఎస్ఎంబీ)లను డిజిటలైజ్ చేయడంతో పాటు అగ్రి-టెక్, హెల్త్-టెక్ రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు ఈ నిధిని ఉపయోగించనున్నట్లు వెల్లడించింది. 2025 చివరి నాటికి 10 బిలియన్ డాలర్ల (రూ.74,829 కోట్ల) విలువైన ఈ-కామర్స్ ఎగుమతులు జరిపేలా దేశంలోని కోటి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లను డిజిటైజ్ చేయడంతోపాటు అదనంగా 10 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని అమెజాన్ లక్ష్యంగా నిర్ణయించుకున్నది.