న్యూఢిల్లీ, జూన్ 1: 2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ కన్సాలిడేటెడ్గా రూ. 3,817 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ నికరలాభం రూ. 3,926 కోట్లు. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 15,404 కోట్లుకాగా, గతేడాది నాల్గవ త్రైమాసికంలో ఆదాయం రూ. 12,560 కోట్లు. తాము గతేడాది జూలైలో కొనుగోలుచేసిన సన్రైజ్ ఫుడ్స్ ఆదాయం కూడా 2021 మార్చి క్వార్టర్లో కలిసివున్నందున, గత ఫలితాలతో తాజా ఫలితాల్ని పోల్చతగదని కంపెనీ తెలిపింది. 2020-21 పూర్తి సంవత్సరంలో ఐటీసీ రూ. 53,155 కోట్ల ఆదాయంపై రూ. 13,389 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికి గాను కంపెనీ బోర్డు రూ.5.75 చొప్పున తుది డివిడెండును సిఫార్సుచేసింది.