హైదరాబాద్, మే 27(నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాలతోపాటు వివిధ రాష్ర్టాలకు ఆక్సీజన్ సరఫరా చేసిన మేఘా ఇంజినీరింగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఎంఈఐఎల్) తాజాగా తమిళనాడులోనూ తమ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఆ రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో మూడు వేలకుపైగా కొవిడ్ బెడ్లను సమకూర్చుతున్నది. ఇందులో ఇప్పటికే చెన్నై, మధురై నగరాలతోపాటు ఇతర ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో 660 బెడ్లు ఏర్పాటు చేసినట్లు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. తమిళనాడుకు చెందిన క్రెడాయ్, జి స్కేర్ రియల్టర్స్ సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.