లండన్: సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజు 2019 వరల్డ్కప్లో ఇండియన్ టీమ్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఆ టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్.. 8 ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుసార్లు మూడంకెల కన్నా ఎక్కువ స్కోర్లు సాధించడం విశేషం. గతంలో ఏ ఇతర క్రికెటర్కూ సాధ్యం కాని రికార్డు ఇది. అంతకుముందు 2015 వరల్డ్కప్లో శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర 4 సెంచరీలతో క్రియేట్ చేసిన రికార్డును రోహిత్ తిరగరాశాడు. లీగ్ స్టేజ్లోనే సౌతాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్లపై సెంచరీలు చేసిన రోహిత్.. చివరి లీగ్ మ్యాచ్లో శ్రీలంకపై మరో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. 2019 వరల్డ్కప్లో రోహిత్ సాధించిన ఈ అరుదైన ఫీట్ను గుర్తు చేస్తూ.. ఐసీసీ మంగళవారం ఓ వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేసింది.