హైదరాబాద్, సెప్టెంబరు 6 (నమస్తే తెలంగాణ) : కోవిడ్ మహమ్మారి, లాక్డౌన్ కారణంగా నష్టాలు చవి చూసిన చిన్న వ్యాపారాలకు డిజిటలైజేషన్ బాగా అచ్చొచ్చింది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు, సొంత వెబ్సైట్లు, యాప్లతో కొత్త వినియోగదారులకు చేరువడంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)లు, చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారు విజయవంతమయ్యారు. ప్రముఖ సర్వే సంస్థ లోకల్ సర్కిల్స్ దేశ వ్యాప్తంగా 172 జిల్లాల్లో 6,200 స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. గడిచిన 12 నెలల్లో డిజిటలైజేషన్ బాట పట్టిన ఎంఎస్ఎంఈలు, చిరువ్యాపారుల్లో 28 శాతం 100శాతం నుంచి 500శాతం వృద్ధిని నమోదు చేశాయి.
12 నెలల్లో డిజిటలైజైన వ్యాపారాలు (శాతంలో)