న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్లోకి సరికొత్త డొమినార్ 400ను పరిచయం చేసింది. ఈ బైకు ధరను రూ.2.16 లక్షలుగా నిర్ణయించింది. 373.3 సీసీ ఇంజిన్తో తయారైన ఈ బైకు యువతను ఆకట్టుకోగలదని, ముఖ్యంగా ప్రయాణాలను ఇష్టపడే వారికి సరైనదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. సిటీ రైడర్లు, దూర ప్రయాణం చేసే టూరిస్టులు అత్యధిక మంది ఈ బైకును ఇష్టపడుతారని బజాజ్ ఆటో హెడ్ నారాయణ్ తెలిపారు.