న్యూఢిల్లీ : జాగ్వర్ ల్యాండ్రోవర్ ఇండియా భారత్లో 2021 జాగ్వర్ ఎక్స్ఎఫ్ను లాంఛ్ చేసింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభించే ఈ లగ్జరీ కారు ధర రూ 71.60 లక్షల నుంచి రూ 76 లక్షలకు (ఎక్స్షోరూం, ఇండియా)అందుబాటులో ఉంటుంది.
2021 జాగ్వర్ ఎక్స్ఎఫ్లో స్వల్ప మార్పులు చేపట్టారు. భారీ ఫ్రంట్ గ్రిల్తో స్టడ్ టైప్ డిజైన్ వెహికల్కు స్టైలిష్ లుక్ తీసుకువచ్చింది. జే షేప్తో కూడిన ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో హెడ్ల్యాంప్స్ రీడిజైన్ ఆకట్టుకుంటుంది. ఫ్రంట్, రియర్ బంపర్లు కూడా న్యూ మోడల్లో రీవ్యాంప్ చేశారు.
ఇక ఇంటీరియర్స్ విషయానికి వస్తే..యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కంపాటబిలిటీతో కూడిన 11.4 ఇంచ్ పివి ప్రొ టచ్స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టమ్, లెదర్తో గేర్ సెలెక్టర్ డయల్ను అమర్చడం 2021 ఎక్స్ఎఫ్కు ప్రీమియం ఫీల్ కల్పించింది. ఈ వెహికల్లో న్యూ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లైస్ చార్జిండ్ ప్యాడ్ వంటి ఫీచర్లను జోడించారు.