హైదరాబాద్: నగర శివార్లలోని గచ్చిబౌలి సమీపంలో ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్)పై రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం అర్ధరాత్రి ఓ కంటైనర్ అదుపుతప్పి గచ్చిబౌలి వద్ద డివైడర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నారు. యాక్సిడెంట్కు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..