సమ్మయ్యనగర్ నాలా అభివృద్ధికి రూ.76 కోట్లు
రూ.54 కోట్లతో రోడ్డు పొడువునా స్మార్ట్ వాటర్ టన్నెల్
రూ.22 కోట్లతో నాలా ప్రొటెక్షన్ వాల్స్
ప్రారంభించిన మంత్రి కేటీఆర్
భీమారం, ఏప్రిల్ 12 : ఓరుగల్లు నగరాన్ని 2016, 2020 సంవత్సరాల్లో వరదలు ముంచెత్తాయి. గత ఏడాది భారీ వర్షాలతో పలు ప్రాంతాలు ముంపునకు గురికాగా 2020 ఆగస్టులో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆయా ప్రాంతాలను పరిశీలించి, అక్కడిక్కడే తక్షణ సాయంగా రూ.25కోట్లను మంజూరు చేశారు. శాశ్వతంగా ఈ సమస్యను పరిష్కరిస్తానని మాట ఇచ్చారు. అప్పటి నుచి ప్రణాళికలను సిద్ధం చేయించి, శాశ్వత పరిష్కారానికి రూ.76 కోట్లతో పనులను వేగవంతంగా చేయిస్తున్నారు. దీంతో మంత్రి రామన్న మాట నిలబెట్టుకున్నాడని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం వరంగల్ నగరంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో భాగంగా 53వ డివిజన్ కేయూసీ వంద ఫీట్ల రోడ్డులోని సమ్మయ్య నగర్లో రూ.76 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభించారు.
ఇందులో రూ.54 కోట్లతో వడ్డేపల్లి చెరువు మత్తడి నుంచి బొందివాగు బ్రిడ్జి మీదుగా గోపాలపురం ఊర చెరువు వరకు, అక్కడి నుంచి 8 మీటర్ల వెడల్పుతో కేయూసీ రోడ్డు, సమ్మయ్య నగర్ జంక్షన్ మీదుగా ప్రెసిడెన్సీ స్కూల్ రిటర్నింగ్ నాలా వరకు 1400 మీటర్ల పొడవుతో స్మార్ట్ వాటర్ టన్నెల్(తుఫాను నీటి సొరంగం) నిర్మించనున్నారు. సమ్మయ్య నగర్లో వరదతో లోతట్టు ప్రాంతంలోని ఇండ్లు మునగకుండా ఉండేందుకు రూ.22 కోట్లతో 1200 మీటర్ల మేర నాలా ఇరువైపులా ప్రొటెక్షన్ బౌండరీ వాల్స్ నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో మం త్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, మాజీ కార్పొరేటర్లు నల్లా స్వరూపారాణి, సిరంగి సునీల్కుమార్, డీఈ సంతోష్, ఏఈ శ్రీకాంత్, 46వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బైరి వెంకట్రాజం, టీఆర్ఎస్ నాయకులు జక్కుల రవి, బాషా, నర్సింగారావు, జ్ఞానదేవ్రెడ్డి, రాజేశ్వర్, నరేశ్, సాయి, ప్రభాకర్ రెడ్డి, విజయ్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
టీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి : ఎమ్మెల్యే గండ్ర
ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.40వేల తగ్గింపు