నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 9: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితాయాదవ్, ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్, బోధన్ ఏఎంసీ చైర్పర్సన్ అర్చన అన్నారు. ఎడపల్లితోపాటు మంగళ్పాడ్ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రారంభించారు. రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అకాల వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని, రైతు లు కోసిన ధాన్యాన్ని కాపాడేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. మంగళ్పాడ్ గ్రామంలో సర్పంచ్ హన్మాండ్లు కొనుగో లు కేంద్రాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షు డు సుభాష్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీలు స్రవంతి, మనీషా, పోతన్న పాల్గొన్నారు.
భీమ్గల్లో మె ప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ ప్రారంభించారు. వైస్చైర్మన్ భగత్, కౌన్సిలర్లు సతీశ్, నర్సయ్య, గంగాధర్, ఖైరున్నీసా బేగం, సర్ప సమాజ్ కమిటీ అధ్యక్షుడు చిన్న పాపారాయుడు పాల్గొన్నారు. మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శెట్పల్లి సొసైటీ చైర్మన్ రాజేశ్వర్, సర్పంచ్ మండల రాజేశ్వర్ ప్రారంభించారు. సుదర్శన్, రాజేందర్, సుధాకర్, జనార్దన్, నవీన్, నరేశ్, భూమేశ్, నారాయణ పాల్గొన్నారు. నవీపేట మండలంలోని నాగేపూర్, జన్నేపల్లి గ్రామాల్లో సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఎంపీపీ శ్రీనివాస్ ప్రారంభించారు. చైర్మన్లు శైలేశ్కుమార్, హన్మాండ్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింగ్రావు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తెడ్డు పోశెట్టి, వైస్ ఎంపీపీ హరీశ్కుమార్, బినోలా సొసైటీ వైస్ చైర్మన్ బాబర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మాణికేశ్వర్రావు, ఏవో సురేశ్గౌడ్, నాయకులు నీరడి బుచ్చన్న, సుద ర్శన్, సంజీవ్రావు, లక్ష్మణ్రావు, రాజు, శంకర్నాయ క్, సాయిలు, ప్రదీప్రావు, సీఈవో పాల్గొన్నారు.
రెంజల్ విండో పరిధిలోని సాటాపూర్లో ఏర్పాటు చేసిన కొనుగో లు కేంద్రాన్ని సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు వికార్పాషా ప్రారంభించారు. ఎంపీటీసీ షేక్ హైమద్, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ చంద్రయ్య, నాయకులు పా ల్గొన్నారు. డిచ్పల్లి మండలం గొల్లపల్లి, సుద్దపల్లి, కమలాపూర్, ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు, కేశారం తదితర గ్రామాల్లో, ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డిపల్లి, వెంగళ్పాడ్ తండా, లోలం తదితర గ్రామాల్లో సొసైటీలు, ఐడీసీఎంఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఈ కొనుగోలు కేంద్రాలను ధర్పల్లి జడ్పీటీసీ జగన్ డీసీఎంఎస్ చైర్మన్ సాంబారిమోహన్తో కలిసి ప్రారంభించారు. డిచ్పల్లి మండలంలో ఏర్పాటుచేసిన కా ర్యక్రమంలో సర్పంచులు లింగం, చిన్నన్న, విండో చైర్మన్ జైపాల్, వైస్ చైర్మన్ చిన్నగంగారాం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణ, ప్రధా న కార్యదర్శి నర్సయ్య, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ నారాయణరెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు విఠల్, డీసీసీబీ డైరెక్టర్ రాజేశ్వర్ పాల్గొన్నారు.
ధర్పల్లి మండలంలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీపీ నల్ల సారికారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పీసు రాజ్పాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నల్ల హన్మంత్రెడ్డి, వైస్ ఎంపీపీ నవీన్రెడ్డి, రామడుగు, ధర్పల్లి సొసైటీల చైర్మ న్లు రాజేందర్రెడ్డి, చిన్నారెడ్డి, రామడుగు, ధర్పల్లి సర్పంచులు పుష్ప, ఆర్మూర్ పెద్దబాల్రాజ్ పాల్గొన్నారు. ఇందల్వాయి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అంజయ్య, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సర్పంచ్ నరేశ్, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తం డాలో ముత్తకుంట సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొ నుగోలు కేంద్రాన్ని ఎంపీపీ బానోత్ అనూష సొసైటీ చైర్మన్ స్వామితో కలిసి ప్రారంభించారు. గాంధీనగర్ తండా, ధర్మా రం, కొత్తపేట గ్రామా ల్లో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. రూరల్ వైస్ ఎంపీపీ సాయిలు, సర్పంచులు హరిచంద్, అనూష, సునీత, లావణ్య, విండో కార్యదర్శి నంబూద్రిపాగ్, ఉపసర్పంచులు గురువయ్య, మోతీనాయక్, సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని సర్పల్లి తం డా, జంగిలోడి తండా, నర్సింగ్పల్లి, న్యావనంది గ్రామాల్లో సిరికొండ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీ టీసీ జగన్ ప్రారంభించారు. ఎంపీపీ సంగీత, జడ్పీటీసీ మాన్సింగ్, సొసైటీ చైర్మ న్ గంగారెడ్డి, ఫిలిప్, సర్పంచులు పాల్గొన్నారు.
ఆర్మూర్ మండలం ఆలూర్లో, పెర్కిట్లోని నాలుగో వార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆలూర్ సొసైటీ చైర్మన్ భోజారెడ్డి, చైర్పర్సన్ పండిత్ వినిత ప్రారం భించారు. వైస్చైర్మన్ షేక్ మున్నా, కౌన్సిలర్ లత, మెప్మా టీఎంసీ ఉదయశ్రీ, టీఎల్ఎఫ్ పట్టణ అధ్యక్షురాలు నీలిమా, ఆలూర్ సొసైటీ వైస్చైర్మన్ రాజేశ్వర్, టీఆర్ఎస్ ఆర్మూర్ మండల అధ్యక్షుడు లింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకు లు శ్రీనివాస్గౌడ్, ముత్యంరెడ్డి, గంగారెడ్డి, సొసైటీ సీఈవో లు పాల్గొన్నారు. కోటగిరి మండలంలోని హంగర్గా, జల్లాప ల్లి ఫారం, కారేగాం, హెగ్డోలి, కొడిచెర్ల, కల్లూర్లో పొతంగల్ విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను పొతంగల్ విండో చైర్మన్ శాంతేశ్వర్ పటేల్, విం డో డైరెక్టర్ విజయ్పటేల్ ప్రారంభించారు. సర్పంచులు వెంకాగౌడ్, జ్యోతి, లింగప్ప, వెంకట్ రెడ్డి, రాంరెడ్డి, మండల కో-ఆప్షన్ సభ్యుడు ఇస్మాయిల్, సీఈవో భరత్కు మార్, రైతులు ఉన్నారు. వేల్పూర్లో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ వైస్ చైర్మన్ ర మేశ్రెడ్డి ప్రారంభించారు. ఎంపీపీ జమున, సర్పంచ్ రాధ, ఎంపీటీసీ మహేశ్, ఉపసర్పంచ్ సత్యం పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
త్వరలోనే ప్రకటించనున్న ప్రభుత్వం: జయేశ్రంజన్