రుద్రంగి, ఏప్రిల్ 2: రైతులను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య పేర్కొన్నారు. పలు సాంకేతిక కారణాలతో రుద్రంగికి గోదావరి జలాలు నిలిచిపోవడంతో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ప్రత్యేక కృషితో శుక్రవారం నీటిని విడుదల చేశారు. ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ సభ్యుడు గట్ల మీనయ్య గోదావరి జలాల రాకను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతమైన రుద్రంగి మండలానికి కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో వేసవిలో సాగు నీరులేక చాలా పొలాలు ఎండిపోయేవని తెలిపారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ప్రత్యేక కృషితోనే నేడు గోదావరి జలాలతో వేసవిలో కూడా నియోజకవర్గంలోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ఎల్లంపల్లి నీటితో ఈ ప్రాంత భూములు సస్యశ్యామలం కానున్నాయని తెలిపారు. రైతులను ఆదుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. రుద్రంగి గ్రామస్తుల తరఫున ఎమ్మెల్యే రమేశ్బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్రావు, ఎంపీటీసీ మంచె లావణ్యరాజేశం, టీఆర్ఎస్ నాయకులు గంగం మహేశ్, మాడిశెట్టి ఆనందం, దయ్యాల కమలాకర్, దయ్యాల నారాయణ, దాసరి గంగారాజం, రైతులు పాల్గొన్నారు.
ఇవి కూడా చూడండి..
యూరప్ను వణికిస్తున్న థర్డ్వేవ్
మయన్మార్లో సైన్యం ఊచకోత.. 43 మంది చిన్నారులు మృతి