తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి
లాభాల బాటలో మహిళా రైతు
ఏడాదిలో రెండు పంటలు.. రూ.4లక్షల ఆదాయం
తూప్రాన్ రూరల్, మార్చి 28 : ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పందిరిసాగు వ్యవసాయ పద్ధతుల్లో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించి లాభాల బాటలో ముందుకు సాగుతున్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్కు చెందిన మహిళా రైతు పిట్ల వరలక్ష్మి పందిరి సాగు పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నది. భర్త చెన్నయ్య సూచన మేరకు ఐదేండ్ల కింద పందిరిసాగుకు దరఖాస్తు చేసుకుంది. దీంతో ఆమెకు స్త్రీనిధి బ్యాంకు ద్వారా రూ.లక్ష రుణ సాయం లభించింది. ఈజీఎస్ పథకం ద్వారా సబ్సిడీపై రూ.95 వేలు వచ్చాయి. ఆమెకు ఎకరం వ్యవసాయ పొలం ఉంది. ప్రభుత్వం సమకూర్చిన నిధులతో భూమిని చదును చేసి పందిరి సాగుకు కావాల్సిన పద్ధతులు పాటించింది. రాతీకడ్డీలు పాతి వాటికి కావాల్సిన బెండింగ్ వైర్లు ఏర్పాటు చేసి పంటలకు నీరందించడానికి డ్రిప్ పరికరాలు అమర్చింది. పందిరి సాగులో తీగజాతి కూరగాయలైన కాకర, బీర, సొరకాయలను పండిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. ప్రతి పంటకు పెట్టుబడులు పోగా రూ.2 లక్షల ఆదాయం లభిస్తున్నది. సంవత్సరంలో 2 పంటలు పండిస్తే రూ.4 లక్షల ఆదాయం పొందుతున్నారు.
పందిరి సాగుతో లాభాలు
పందిరిసాగు పద్ధతుల్లో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధిస్తున్నాం. ప్రభుత్వం రుణసాయం, సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందజేసింది. పందిరిసాగులో పం డించిన కూరగాయలకు నగరంలోని మార్కె ట్లో మంచి డిమాండ్ ఉంది. ఇతర పనులకు వెళ్లకుండా పందిరిసాగుపైనే దృష్టి పెట్టాం. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే మా కుటుం బం పందిరి సాగులోనే నిమగ్నమైంది.
-పిట్ల వరలక్ష్మి, మహిళా రైతు
ఇవి కూడా చదవండి..
గ్రామాన్నంతా తెల్లదుప్పటిలా కప్పేసిన మంచు..!
నిద్రపట్టట్లేదా.. ఈ పండ్లు తినండి!