హైదరాబాద్ : గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 412 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్లో తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,03,867కు చేరాయి. మరో 216 మంది వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 2,99,042 మంది డిశ్చార్జి అయ్యారని చెప్పింది. వైరస్ ప్రభావంతో మరో ముగ్గురు మృతి చెందగా, మృతుల సంఖ్య 1,647కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.55శాతంగా ఉందని, రికవరీ రేటు 98.41శాతం ఉందని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,151 యాక్టివ్ కేసులున్నాయని, 1,285 మంది హోంఐసోలేషన్లో ఉన్నారని వివరించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 103 కేసులు నమోదయ్యాయి.