ముంబై, మే 4: బజాజ్ గ్రూపు..అదనంగా మరో రూ.200 కోట్ల విరాళం అందిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా వైరస్తో ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో గతేడాది రూ.100 కోట్ల విరాళం అందించిన సంస్థ..ఈసారి రెండు రెట్లు పెంచింది. సెకండ్ వేవ్తో దేశీయ పరిస్థితులు అగమ్యగోచరంగా ఉన్నాయని, దీంతో ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో మరో రూ.200 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు బజాజ్ గ్రూపు గౌరవ చైర్మన్ రాహుల్ బజాజ్ ప్రకటించారు.