ప్రకటించిన మహీంద్రా గ్రూపు
న్యూఢిల్లీ, మే 28: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఎట్టకేలకు లాభాల్లోకి మళ్లింది. ఏకీకృత ప్రాతిపదికన గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.163 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ప్యాసింజర్ వాహనాలతోపాటు ట్రాక్టర్ల అమ్మకాలు టాప్గేర్లో దూసుకుపోవడం సంస్థకు కలిసొచ్చింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.3,255 కోట్ల నష్టాన్ని నమోదు చేసుకున్నది. ఏడాది క్రితం రూ.9 వేల కోట్లుగా ఉన్న సంస్థ ఆదాయం.. గత త్రైమాసికానికిగాను రూ.13,338 కోట్లు ఆర్జించినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గతేడాది మొత్తానికి రూ. 44,574 కోట్ల ఆదాయంపై రూ.923 కోట్ల నికర లాభాన్ని గడించింది. మరోవైపు రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.875 లేదా 175 శాతం డివిడెండ్ను కంపెనీ బోర్డు ప్రతిపాదించింది. అలాగే, వచ్చే మూడేండ్లకాలంలో రూ.17 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ నిధులను నూతన వాహనాలను విడుదల చేయడానికి, ఇతర గ్రూపు సంస్థల వ్యాపారాన్ని వినియోగించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 2026 నాటికి 23 ప్యాసింజర్ వాహనాలు, 37 వ్యవసాయానికి సంబంధించిన వాహనాలు ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నది.