జియో ఫోన్ యూజర్లకు ఫ్రీ కాల్స్కు అవకాశం
న్యూఢిల్లీ, మే 14: కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జియో ఫోన్ యూజర్లకు రిలయన్స్ జియో శుభవార్తను అందించింది. రోజుకు 10 నిమిషాల అవుట్గోయింగ్ కాల్స్ను ఉచితంగా అందిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. సెకండ్ వేవ్ కారణంగా పలు రాష్ర్టాలు లాక్డౌన్ ప్రకటించిన ప్రస్తుత తరుణంలో ఇలా ఉచితంగా టాక్టైం ఆఫర్ను ప్రకటించిన తొలి సంస్థ జియో కావడం విశేషం. ఈ ఉచిత టాక్టైం అందించడానికి జియో..రిలయన్స్ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తున్నది. దీంతోపాటు ప్రతి రీచార్జిపై అంతే స్థాయి కలిగిన రీచార్జిని ఉచితంగా అందిస్తున్నది.