హైదరాబాద్, అక్టోబర్ 14: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ లాట్.. టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందనను ప్రచారకర్తగా నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ ఎం అఖిల్ మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరాల్లో తెలుగు రాష్ర్టాల్లో కొత్తగా 100కి పైగా స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు, వీటిద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వీలుపడనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో సంస్థ 150 అవుట్లెట్లు ఉన్నాయి.