న్యూఢిల్లీ, ఆగస్టు 24: కొద్దిరోజుల క్రితం వరుసగా కొత్త రికార్డుల్ని సృష్టించి, హఠాత్తుగా వెనక్కుతగ్గిన స్టాక్ మార్కెట్ తిరిగి రికార్డుల బాటను పట్టింది. మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 400 పాయింట్లకుపైగా పెరిగి 55,959 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంతటి గరిష్ఠస్థాయిలో సెన్సెక్స్ ముగియడం ఇదే ప్రధమం. ఎన్ఎస్ఈ నిఫ్టీ 128 పాయింట్లు ర్యాలీ జరిపి ఆల్టైమ్ రికార్డు 16,625 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లన్నీ కదంతొక్కిన నేపథ్యంలో ఇక్కడ బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. సెన్సెక్స్-30 షేర్లలో అన్నింటికంటే అధికంగా బజాజ్ ఫిన్సర్వ్ 8 శాతం ఎగిసింది. మ్యూచువల్ ఫండ్ను ప్రారంభించేందుకు ఈ కంపెనీకి సెబి అనుమతి లభించిన నేపథ్యంలో ఈ షేరు భారీగా పెరిగింది. టెక్ మహింద్రా, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్లు 1-3.5 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. ఫైజర్-బయోఎన్టెక్ కొవిడ్ వ్యాక్సిన్కు యూఎస్ఎఫ్డీఏ పూర్తిస్థాయిలో అనుమతి మంజూరుచేయడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమై, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోగలదన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లలో ర్యాలీ జరిగిందని విశ్లేషకులు తెలిపారు.
ఇన్ఫీ @ 100 బిలియన్ డాలర్లు
ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ మార్కెట్ విలువ చరిత్రలో మొదటిసారిగా 100 బిలియన్ డాలర్ల మార్క్ను (రూ.7.40 లక్షల కోట్లు) దాటింది. దీంతో భారత్ మార్కెట్లో 100 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించిన నాల్గవ కంపెనీగా ఇన్ఫోసిస్ నిలిచింది. ఈ ఫీట్ను ఇప్పటివరకూ టీసీఎస్, రిలయ న్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు సాటధించాయి. ఇన్ఫోసిస్ షేరు రికార్డు గరిస్ఠస్థాయి రూ. 1, 756 వద్దకు చేరడంతో ఈ కంపెనీ మార్కెట్ విలువ 100.78 బిలియన్ డాలర్లకు పెరిగింది.
2.79 లక్షల కోట్లు పెరిగిన సంపద
ఈక్విటీలు రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో మదుపరుల సంపద కూడా అమాంతం పెరిగింది. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఈక్విటీ పెట్టుబడిదారుల సంపద మరో రూ.2.79 లక్షల కోట్ల మేర పెరిగింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.2,40,47,079.99 కోట్లు పెరిగి రూ.2,37,67,773.84 కోట్లకు చేరుకున్నది.