న్యూఢిల్లీ, జూలై 16: ప్రీమియం మోటర్సైకిల్ బ్రాండ్ కేటీఎం.. తమ 250 అడ్వెంచర్ బైక్ ధరను దాదాపు రూ.25,000 తగ్గించింది. ఈ పరిమిత వ్యవధి ఆఫర్ ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని శుక్రవారం తెలిపింది. దీంతో ప్రస్తుతం రూ.2.3 లక్షలకే ఈ మోటర్సైకిల్ లభిస్తుందని బజాజ్ ఆటో భాగస్వామిగా ఉన్న కేటీఎం తెలిపింది. ఇంతకుముందు ఢిల్లీ ఎక్స్షోరూం ప్రకారం దీని ధర రూ.2.54 లక్షలుగా ఉన్నది. కాగా, ధర తగ్గింపుతో మరింత మంది కస్టమర్లను బైక్ ఆకర్షించగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా బజాజ్ ఆటో ప్రోబైకింగ్ అధ్యక్షుడు సుమిత్ నారంగ్ వ్యక్తం చేశారు. 248 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్తో ఉన్న ఈ బైక్.. 30 పీఎస్ పవర్ను డెలివరీ చేస్తుంది.