ముంబై, ఫిబ్రవరి 12: మనీ లాండరింగ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్కు ఊరట లభించింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు శుక్రవారం ఆమెకు రూ.5 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కానీ కోర్టు అనుమతి లేకుండా దేశాన్ని వీడి వెళ్లరాదని స్పష్టం చేసింది. వీడియోకాన్ గ్రూపునకు రూ.1,875 కోట్ల రుణాలను మంజూరు చేయడంలో అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై చందా కొచ్చర్తోపాటు ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్పై మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదైనది తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు గతేడాది సెప్టెంబర్లో దీపక్ను అరెస్టు చేశారు. మిగిలిన నిందితులూ కోర్టులో హాజరు కావాలని సమన్లు జారీ చేయడంతో చందా కొచ్చర్ పీఎంఎల్ఏ కోర్టుకు వచ్చారు.