ముంబై: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తన డెలివరీ సేవలను విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని పెంచి 2030 సంవత్సరం చివరి నాటికి 25 వేల ఈవీలను రంగంలోకి దించేందుకు మహీంద్రా లాజిస్టిక్స్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. మహీంద్రా లాజిస్టిక్స్ ఇప్పటికే దేశంలోని ఆరు నగరాల్లో ఎలక్ట్రిక్ లాస్ట్ మైల్ డెలివరీ సర్వీసు లను ప్రారంభించింది.