హైదరాబాద్, జూలై 21: ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ జీఆర్టీ జ్యూవెల్లర్స్.. బ్యాంగిల్స్ మేళాను నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేళాలో విస్తృతమైన, వైవిధ్యమైన శ్రేణి గాజులను విక్రయిస్తున్నది. అలాగే బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ.50 తగ్గించిన సంస్థ.. వజ్రాలు, అన్కట్ వజ్రాలపై 10 శాతం రాయితీ, వెండి ఆభరణాల ఎంఆర్పీపై 10 శాతం రాయితీ, వెండి సామానులపై 15 శాతం తక్కువకే అందిస్తున్నది. మహిళలు అత్యధికంగా ఇష్టపడే వాటిలో గాజులు ఒకటని, తమకు ఇష్టమైన డిజైన్లను, సరికొత్త కలెక్షన్లను పరిచయం చేస్తున్నట్లు కంపెనీ ఎండీ జీఆర్ ఆనంద్ తెలిపారు.