హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం సాయంత్రం 5.30 గంటల వరకు కొత్తగా 465 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 65,607 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 465 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. కొవిడ్-19తో తాజాగా నలుగురు చనిపోయారు. 869 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,31,683కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 10,316గా ఉంది. రాష్ట్రంలో కొవిడ్తో ఇప్పటి వరకు మొత్తం 3,729 మంది చనిపోయారు.