మంత్రులు ఈటల రాజేందర్, శ్రీనివాస్గౌడ్ పిలుపు
బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
రవీంద్రభారతి/ హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని రవీంద్రభారతిలో శుక్రవారం బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణలో ఈటల మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడుతూనే సమాజ సంక్షేమం కోసం పోరాడుతారని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని, సమస్యలపై దేశ పౌరుడిగా, సగటు మనిషిగా స్పందించాలని సూచించారు. తాను రాజకీయాలు మాట్లాడటం లేదని, రైతుల కోసం మాట్లాడుతున్నానని, కేంద్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం చేస్తున్న క్రీమిలేయర్ చట్టాన్ని అసెంబ్లీలో తీర్మానంచేసి పంపినా.. కేంద్రం ఇప్పటివరకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల పెంపు, క్రీమిలేయర్ చట్టంపై త్వరలో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
స్టడీ మెటీరియల్ కోసం వెళ్తూ..
భారం కావొద్దని.. వృద్ధ దంపతులు
ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి
అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు
పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి
కేసీఆర్ ఆపద్బంధు బీసీల బంధువు
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత
రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం