నల్లగొండ : మిర్యాలగూడ పట్టణంలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో విషాదం నెలకొంది. డ్రైనేజీలో పూడికతీసేందుకు మ్యాన్హోల్లోకి దిగి కూలీతోపాటు వర్క్ సూపర్వైజర్ ప్రాణాలు కోల్పోయారు.
పట్టణంలోని తాళ్లగడ్డలో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. మిర్యాలగూడ మండలం యాద్గార్పల్లి గ్రామానికి చెందిన కుంచం శ్రీను, దొండవారిగూడెం గ్రామానికి చెందిన సంతోశ్ రెడ్డి అండర్గ్రౌండ్ డ్రైనేజీలో పూడిక తీసేందుకు దిగారు.
పనిచేస్తుండగా ఊపిరాడకపోవడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా దవాఖానకు తరలించారు.