చండీగఢ్: ఒక మెర్సిడెస్ కారు వేగంగా దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు మరణించారు. పంజాబ్లోని మొహాలిలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న మెర్సిడెస్ కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో రాధా సోమి చౌక్ వద్ద శనివారం తెల్లవారుజామున సైకిళ్లపై వెళ్తున్న ఇద్దరితోపాటు నైట్ షిఫ్ట్ ఉద్యోగులతో వెళ్తున్న ఆఫీస్ క్యాబ్పైకి కారు దూసుకెళ్లింది. ఆ క్యాబ్ 2-3 సార్లు పల్టీకొట్టగా, అనంతనం ఆ కారు రోడ్డు పక్కన ఉన్న ఇనుప ర్యాలీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక సైకిలిస్ట్, క్యాబ్లోని ఇద్దరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు.
ఎయిర్ బ్యాగ్ తెరుచుకోవడంతో కారు డ్రైవర్తోపాటు అందులో ప్రయాణించిన ఇద్దరికి ప్రాణాపాయం తప్పింది. గాయపడిన వారు మరో వాహనంలో అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. బీభత్సం సృష్టించిన కారులో బీరు బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. కారు నంబర్ ఆధారంగా డ్రైవర్ను అరెస్ట్ చేశారు. అతడితోపాటు అందులో ప్రయాణించిన ఇద్దరు స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.