వైద్యరంగానికి సమాజం రుణపడి ఉంటుంది
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
వనపర్తి, నాగర్కర్నూల్, కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ వార్డుల సందర్శన
పాల్గొన్న ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మర్రి, జైపాల్యాదవ్, ఎమ్మెలీ కశిరెడ్డి, కలెక్టర్ శర్మన్
వనపర్తి రూరల్/కల్వకుర్తి/నాగర్కర్నూల్, మే 20 : కరోనా విపత్తులో చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ రక్షించుకునేందుకు ప్రభుత్వం అన్ని రకాల వైద్య సేవలను కల్పిస్తుందని, మనోధైర్యానికి మించిన మందు లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. గురువా రం వనపర్తి జిల్లా ప్రభుత్వ దవాఖానలో కరోనా బాధితులను పరామర్శించి.. అందుతున్న వైద్య సేవల గురిం చి తెలుసుకున్నారు. అలాగే కల్వకుర్తి ప్రభుత్వ కమ్యూని టీ దవాఖానను, కొవిడ్ చికిత్స వార్డులను ఎంపీ రాము లు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్కర్నూల్ కలెక్టర్ శర్మన్తో కలిసి మం త్రి పరిశీలించారు. అలాగే నాగర్కర్నూల్ జిల్లా దవాఖానలోని కొవిడ్ వార్డును ఎంపీ, ఎమ్మెల్సీ, కలెక్టర్, ఎమ్మె ల్యే మర్రి జనార్దన్రెడ్డితో కలిసి సందర్శించారు. బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించడంతో కరోనాను కట్టడి చేయొచ్చన్నారు. వైద్యం తీసుకోవడంలో ఆలస్యం చేస్తేనే ఆక్సిజన్ సమస్య వస్తుందని తెలిపారు. ధైర్యం కోల్పోతే ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుందన్నారు. లక్షణాలు ఉన్న వారికి వెంటనే వైద్యం అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జ్వర సర్వే కార్యక్రమాన్ని చేపట్టి ఉచితంగా మందుల కిట్లను అందిస్తుందన్నారు. దేశం లో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అందువల్లే ప్రస్తుతం పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు నివేదికలు వస్తున్నాయన్నారు. ముందస్తు జాగ్రత్తగా విధించిన లాక్డౌన్ మంచి ఫలితాన్నిస్తుందన్నారు. ప్రజలు మరికొన్ని రోజులు సహకరిస్తే రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయొచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ దవాఖానల్లోని వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, వైద్యసిబ్బంది తమ ప్రాణాలు తెగించి సేవలందిస్తున్నారన్నారు. మీరు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని, చేతులెత్తి మొక్కుతున్నానన్నారు.
వారిందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో తనకు, ఎంపీ రాములుకు కరోనా వచ్చి తగ్గిపోయిందని, బయపడొద్దన్నారు. మెరుగైన సేవలందించేందుకు తమ వంతుగా కృషి చేస్తామన్నారు. అనంతరం దవాఖానల్లోని ప్రతి వార్డులో తిరిగారు. వనపర్తిలో మంత్రి వెంట ఆర్డీవో అమరేందర్, ము న్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్చైర్మన్ వాకిటి శ్రీధర్, దవాఖాన ఆర్ఎంవో చైతన్యగౌడ్, సూపరింటెండెంట్ హ రీశ్సాగర్, మహేశ్వర్రెడ్డి, కౌన్సిలర్లు, వైద్యులు ఉన్నారు. నాగర్కర్నూల్, కల్వకుర్తిలో డీఎంహెచ్వో సుధాకర్లాల్, ఆర్డీవో రాజేశ్కుమార్, డీఎస్పీ గిరిబాబు, మున్సిపల్ చైర్మ న్ ఎడ్మ సత్యం, సింగిల్ విండో చైర్మన్ జనార్దన్రెడ్డి, వైస్ చైర్మన్ శ్యాం, జెడ్పీటీసీ భరత్ ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ విజయ్గౌడ్, కాటన్మిల్ గుర్తింపు సంఘం నాయకుడు సూర్యప్రకాశ్, కౌన్సిలర్లు, దవాఖాన సూపరింటెండెంట్ రమేశ్చంద్ర, వైద్యులు శి వరాం, రోహిత్, నాగభూషణం, సిబ్బంది పాల్గొన్నారు.