అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు నిత్యం వేలల్లో పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 18,972 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి 10,227 మంది కోలుకున్నారు.
71 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 11,63,994 పెరిగాయి. 10 లక్షల మందికిపైగా కోలుకున్నారు.
యాక్టివ్ కేసుల సంఖ్య 1.5 లక్షలు దాటింది. ఇవాళ్టి వరకు 8207 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో లక్షా 15 వేల శాంపిళ్లకుపైగా పరీక్షించినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.