రాజాపేట, మార్చి 25: చుట్టూ కొండకో నలు, పచ్చని అడవి అందాల మధ్య వెలసింది ఓ పల్లె సీమ. ఒకే సామాజిక వర్గానికి చెందిన ప్రజలున్న పల్లె సీమను ఇటీవలే తెలంగాణ సర్కార్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా మనుగడలోకి తీసుకువచ్చిం ది. దీంతో రాజాపేట మండలంలోని కొన్రెడ్డిచెర్వు గ్రామస్థులంతా ఐక్యంగా గ్రామ పంచాయతీ పాలక వర్గాన్ని సైతం ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. అలాంటి పల్లె నేడు ప్రగతి వైపు పరుగులు పెడుతున్నది. పల్లెల ముఖచిత్రం మార్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో పల్లె రూపురేఖలు మారిపోతున్నాయి. హరితహారం కార్యక్రమంలో భా గంగా రోడ్డుకు ఇరువైపులా, గ్రామంలో మొక్కలు నాటి సంరక్షిస్తుండటంతో పచ్చదనం సంతరించుకున్నది. గ్రామంలో సేకరించిన చెత్తను డంపింగ్యార్డుకు తరలి స్తూ గ్రామ స్వచ్ఛతకు ముందుకు సాగుతున్నారు. వైకుంఠధామ నిర్మాణం పూర్తి కావడంతో చనిపోయిన వ్యక్తుల చితి కష్టాలు తీరాయి. గ్రామంలో కమ్యూనిటీహాల్, పం చాయతీ భవన నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో మౌలిక వసతులు సమకూరుతున్నాయి.
ఆదర్శంగా వైకుంఠధామం నిర్మాణం
అంత్యక్రియలకు ఇబ్బందుల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో భాగం గా ప్రతి గ్రామంలో వైకుంఠధామాలను నిర్మిస్తు న్నది. అందులో భాగంగా కొన్రెడ్డిచెర్వులో వైకుంఠధామం నిర్మాణ పనులు చకచకా పూర్తి చేసుకొని మండలంలోనే ప్రత్యేకతను చాటుకున్నది. వైకుంఠధామ పనులు వందశాతం పూర్తి చేసి అతి సుందరంగా తీర్చిదిద్దారు.
ప్రతిష్ఠాత్మకంగా పల్లె ప్రగతి
గ్రామ రూపురేఖలు మార్చేందుకు తెలంగాణ సర్కార్ తీసుకున్న పల్లెప్రగతిని ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నాం. పల్లె ప్రగతితో మౌలిక వసతులు కల్పించడంతో గ్రామ ముఖచిత్రమే మారిపోతు న్నది. ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో పల్లెను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతున్నాం. వైకుంఠధామం, డంపింగ్యార్డు పనులు పూర్తి చేసి మండలంలోనే గ్రామాన్ని ఆదర్శంగా నిలిపాం. బీసీ కమ్యూనిటీహాల్, పంచాయతీ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
అన్ని రంగాల్లో అభివృద్ధి
కొన్రెడ్డిచెర్వు గ్రామాన్ని తెలంగాణ సర్కార్ కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడంతో గ్రామస్థులంతా కలిసి పాలకవర్గా న్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నాం. తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. గ్రామ శివారులో అతి సుందరంగా వైకుంఠధామం, డంపింగ్యార్డు పనులు పూ ర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రజల భాగస్వామ్యంతో గ్రామ పంచాయతీ పాలకులు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
కొనసాగుతున్న అభివృద్ధి పనులు
గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభు త్వం నిధులు మంజూరు చేయడంతో అభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.20లక్షలు, కమ్యూనిటీహాల్ నిర్మాణం కోసం రూ. 5 లక్షలు మంజూరు కాగా, గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణ పనులు ప్రారంభం కా గా, కమ్యూనిటీహాల్ పనులు 50 శాతం పూర్తయ్యాయి. దీంతో కొత్త గ్రామ పంచాయతీలో మౌలిక వసతులు సమకూరుతున్నాయి.