బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
చిత్తాపూర్, భీమినిలో హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణానికి భూమి పూజ
నెన్నెల, జూన్ 9 : ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మండలంలోని చిత్తాపూర్లో ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణ పనులను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అన్ని సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. మారుమూల గ్రామాల్లో వైద్య సేవలు అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఉప కేంద్రాలను నిర్మిస్తున్నదని తెలిపారు. దీని ద్వారా 54 రకాల సేవలు ప్రజలకు అందుతాయన్నారు. సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. మండలంలోని అన్ని ఉప కేంద్రాలకు నిధులు వచ్చాయని, సకాలంలో పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జడ్పీటీసీ శ్యామల, పీఏసీఎస్ చైర్మన్ మేకల మల్లేశ్, ఆత్మ చైర్మన్ సున్నం రాజు, సర్పంచ్లు పద్మ, సుధ, లక్ష్మి, ఎంపీటీసీ కమల, నాయకులు భీమాగౌడ్, ప్రతాప్ రెడ్డి, రాంచందర్, వెంకటేశ్ పాల్గొన్నారు.
భీమిని మండల కేంద్రంలో..
కన్నెపల్లి, జూన్ 9 : భీమిని మండల కేంద్రంలో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి ఎమ్మెల్యే చిన్నయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణం చేపడుతున్నదన్నారు. ఇందులో భాగంగా భీమిని మండల కేంద్రంలో హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి రూ.16 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోతురాజుల రాజేశ్వరీ-లక్ష్మణ్, జడ్పీటీసీ పోతురాజుల గంగక్క, పీఏసీఎస్ చైర్మన్ పోతురాజుల నారాయణ, సోషల్ వెల్ఫేర్ డీఈఈ రవీందర్గౌడ్, ఏఈ వినయ్, వైద్యాధికారి శ్రీనివాస్, బిట్టూరుపల్లి సర్పంచ్ ఎల్లాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు నిరంజన్ గుప్తా, పోతరాజుల రాజయ్య, ఓంప్రకాశ్, మహేష్గౌడ్, ఆనంద్గౌడ్, శ్రీనివాస్, సాధిక్, సుధాకర్, నందకిశోర్ పాల్గొన్నారు.