దుండిగల్,మార్చి19: ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రోన్ల తయారీని ఒక అభిరుచిగా నేర్చుకుని, అందులో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల ఎరోనాటికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డా.సత్యనారాయణ గుప్త అన్నారు. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ కళాశాలలోని ఎరోనాటికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మొదటి సంవత్సరం విద్యార్థులకు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘డ్రోన్ వర్క్ షాప్’ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డా.సత్యనారాయణ గుప్త మాట్లాడుతూ.. ఒకప్పుడు యుద్ధసమయాల్లోనే డ్రోన్లను వినియోగించే వారని ప్రస్తుతం మందులు, వస్తువులను ఒకచోట నుంచి మరో చోటకు చేరవేయడానికి వినియోగిస్తున్నారని తెలిపారు.
ఫొటోగ్రఫీ రంగంలోనూ డ్రోన్ల వినియోగం పెరిగిందన్నారు. ఈ క్రమంలో ఎరోనాటికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రోన్ల తయారీ, వినియోగంలో నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్షాప్లో విద్యార్థులకు చిన్న విమానాలు, డ్రోన్ల తయారీపై వివరిస్తామన్నారు. ఈ వర్క్షాప్లో ఎంఎల్ఆర్ విద్యాసంస్థల అధిపతి మర్రిరాజశేఖర్రెడ్డి, ప్రిన్సిపాల్ డా.కే.శ్రీనివాసరావు, వివిధ విభాగాలకు చెందిన అధిపతులు డా.రాధికాదేవి, ఎం.వేంకటేశ్వరరెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.