మంచిర్యాల అర్బన్, మార్చి 16 : కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను నిరసిస్తూ రెండో రోజూ మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ బ్యాంకులను బంద్ చేసి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ హవేలి రాజు మాట్లాడుతూ ప్రైవేటీకరణ వల్ల అనేక ఇబ్బందులు వస్తాయ ని, నిరుద్యోగులు పెరుగుతారన్నారు. నామమాత్రపు రుసుముతో ప్రభుత్వ రంగ బ్యాం కులు అందిస్తున్న సర్వీసెస్ ప్రైవేటీకరణ తర్వాత ఈ చార్జీలు పెరుగుతాయని, సామా న్య ఖాతాదారులపై రెట్టింపు భారం పడుతుందన్నారు. గ్రామాల్లో బ్యాంకులు మూతపడే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వెంకటేశ్వర థియేటర్, రెడ్డి కాలనీ, బెల్లంపల్లి చౌర స్తా మీదుగా భారీ ర్యాలీ తీశారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగ సంఘ నాయకులు మహిపాల్, పవన్, చంద్రమౌళి, కే రాజు, శ్రీనివాస్, సురేశ్, వంశీ, ఎస్బీఐ రెడ్డి కాలనీ, ఐబీ చౌరస్తా బ్రాంచ్, యూబీఐ మంచిర్యాల, ఐబీ చౌరస్తా బ్యాంకుల, టీజీబీ మేదరివాడ, ఇండియన్ బ్యాంకు, ఇతర బ్యాంకుల ఉద్యోగులు 600 మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
తాండూర్, మార్చి 16 : రెండో రోజూ బ్యాంకులు బంద్ చేసి అధికారులు, ఉద్యోగులు సమ్మెకు దిగారు. బ్యాంకుల ప్రైవేటీక రణను విరమించుకోవాలని బ్యాంకు అధికా రులు డిమాండ్ చేశారు. బుధవారం నుంచి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని వారు తెలిపార